తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భారీ విరాళం అందంది. గురువారం చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్త నళినీకృష్ణ స్వర్ణ కిరీటాన్ని కానుకగా అందజేశారు. 1.7 కేజీల బరువున్న ఈ కిరీటం సుమారు రూ. 27 లక్షల విలువ చేస్తుందని తితిదే అధికారులు తెలిపారు.
స్వామివారి ఉత్సవమూర్తులైన మలయప్పకు ఈ కిరీటాన్ని అలంకరిస్తారు. స్వామివారి దేవేరులు, భూదేవీలకు కూడా స్వర్ణకిరీటాలు తయారు చేయించి త్వరలో తితిదేకు అందజేస్తానని నళినీకృష్ణ తెలిపారు.
మరోవైపు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు స్వర్ణ శంఖు, చక్రాలను విరాళంగా సమర్పించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన వెంకటకోనారావు రూ. 45లక్షల విలువ చేసే బంగారు శంఖు, చక్రాలను తితిదే అధికారులకు అందజేశారు.
2.7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ శంఖు చక్రాలకు వజ్రాలు కూడా పొదిగించారు. ఆలయ సన్నిధిలో కొలువైన మూలవర్లకు ఈ స్వర్ణ శంఖు చక్రాలను అలంకరిస్తారని తితిదే అధికారులు తెలిపారు.