Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల వెంకన్నకు భారీ విరాళం

Advertiesment
స్వర్ణ కిరీటం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భారీ విరాళం అందంది. గురువారం చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్త నళినీకృష్ణ స్వర్ణ కిరీటాన్ని కానుకగా అందజేశారు. 1.7 కేజీల బరువున్న ఈ కిరీటం సుమారు రూ. 27 లక్షల విలువ చేస్తుందని తితిదే అధికారులు తెలిపారు.

స్వామివారి ఉత్సవమూర్తులైన మలయప్పకు ఈ కిరీటాన్ని అలంకరిస్తారు. స్వామివారి దేవేరులు, భూదేవీలకు కూడా స్వర్ణకిరీటాలు తయారు చేయించి త్వరలో తితిదేకు అందజేస్తానని నళినీకృష్ణ తెలిపారు.

మరోవైపు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు స్వర్ణ శంఖు, చక్రాలను విరాళంగా సమర్పించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన వెంకటకోనారావు రూ. 45లక్షల విలువ చేసే బంగారు శంఖు, చక్రాలను తితిదే అధికారులకు అందజేశారు.

2.7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ శంఖు చక్రాలకు వజ్రాలు కూడా పొదిగించారు. ఆలయ సన్నిధిలో కొలువైన మూలవర్లకు ఈ స్వర్ణ శంఖు చక్రాలను అలంకరిస్తారని తితిదే అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu