వైశాఖ, శ్రవణ, కార్తీక, మార్గశిర, మాఘ మాసాలలో శంఖుస్థాపన కానీ, గృహప్రవేశం గాని చేసిన సర్వదా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబాబివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సంతానాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది. శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమిలో శంకుస్థాపన, గృహప్రవేశాలు చేయరాదు. పుష్య, ఆషాఢ, భాద్రపద మాసాలలో శంకుస్థాపన గాని, గృహప్రవేశం కాని చేసిన హానికరం. చైత్ర,జ్యేష్ట మాసాల్లో సామాన్యంగా ఉండగలదు.
గురుబలం ఉన్న ముహూర్తాల్లో గృహప్రవేశం, శంకుస్థాపన చేసిన సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. వైశాఖమాసంలో శుభదాయకమని, జ్యేష్టమాసంలో సామాన్యంగా ఉంటుంది. ఆషాఢమాసంలో హానికరమనీ, శ్రావణ మాసంలో ధనాభివృద్ధి చేకూరుతుందని, భాద్రపదమాసంలో దరిద్రమనీ, ఆశ్వీయుజంలో గౌరవం చేకూరుతుందనీ, కార్తీకంలో ఆర్థికాభివృద్ధి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందనీ, మార్గశిరంలో ధనప్రాప్తి కలుగుతుందనీ, పుష్యమాసంలో అశాంతి అని, మాఘ, ఫల్గుణ మాసాల్లో సంకల్పసిద్ధి చేకూరుతుందని ముహూర్త శాస్త్రం చెపుతుంది.