Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యాభర్తలు ఆ సమయంలో తప్ప మిగిలిన సమయంలో అది చేయరాదు

Advertiesment
significance
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (17:28 IST)
భార్యాభర్తలు ఏయే సమయాల్లో శృంగారంలో పాల్గొనాలన్నది పెద్దలు చెప్పివున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇరువురు శృంగారంలో పాల్గొనడం సహజమే అయినప్పటికీ అర్థరాత్రి దాటిన తర్వాత.. అంటే 3 గంటల తర్వాత శృంగారం చేయడం అనేది పలు సమస్యలకు దారితీస్తుందట.
 
వేకువ జామున 3 గంటల తర్వాత బ్రహ్మముహూర్తంగా చెప్పబడింది. అందువల్ల ఆ సమయంలో ఆ కలాపాలు చేయరాదన్నది నానుడి. అంతేకాదు... ఆ తర్వాత కూడా పగటిపూట పాల్గొనరాదని చెప్పబడింది.
 
అదేవిధంగా చాలామంది కనీసం కాళ్లూ చేతులు, ముఖం కడుక్కోకుండా బెడ్ పైన పడుకునేందుకు ఉపక్రమిస్తారు. ఇలాంటి చర్యల వల్ల వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం వుందని చెపుతారు.
 
రాత్రివేళ భోజనం చేసిన తర్వాత చాలామంది తిన్న ఎంగిలి పాత్రలను షింక్ లో పడేసి రేపు శుభ్రం చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ వాటిని అలా వదిలేయడం వల్ల వాటిపై బొద్దింకలు, ఇంకా ఎన్నో హానికారక క్రిములు చేరి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కనుక రాత్రిపూట భోజనం ముగియగానే వెంటనే పాత్రలు కడిగేయడం మంచిది.
 
అదేవిధంగా ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. అశుభ్రంగా వున్న ఇంటిలో లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ వుండదని చెప్పబడింది. కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై వుండాలంటే పైన చెప్పబడినవి పాటించాలంటున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమకు సీతమ్మ చెప్పిన కార్యసిద్ధి మంత్రం..? 1110 సార్లు.. 40రోజులు