Publish Date: Mon, 18 Jul 2022 (23:25 IST)
Updated Date: Mon, 18 Jul 2022 (23:26 IST)
షష్ఠి రోజున కుమార స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం.
ఈ పుణ్యతిథి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో..షష్ఠి తిథిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు ,పువ్వులు, వెండి నాగ పడగలు, వెండి నేత్రాలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.
జాతకంలో కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. ఇంకా షష్ఠి తిథి రోజున నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం