నవంబర్ నెల ఎలా ఉంటుందంటే...!
చలిగాలులు తీవ్రంగా ఉంటాయి
ప్రకృతి ఏర్పడ్డప్పటి నుంచి మార్పులు, చేర్పులు, మంచి సంఘటనలు, దుర్ఘటనలు, ప్రకృతి ప్రకోపాలు జరుగుతున్నాయి. దీంతోపాటు ప్రతి మనిషి జీవితంలోను మార్పులు చెందుతుంటాయి. అదే విధంగా గ్రహాల స్థితిగతుల మార్పుతో రాశులలోను మార్పులు సంభవిస్తుంటాయి. ఈ మార్పుల వలన 2009 నవంబర్ నెలలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. దీనిపై జ్యోతిష్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం...!
నవంబర్ 3న శుక్ర గ్రహం తులా రాశిలో ప్రవేశిస్తుంది. దీంతో మంచి ఫలితాలుంటాయి. రోగుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అక్కడక్కడ విభేదాలు తలెత్తుతుంటాయి.
నవంబర్ 12న బుధుడు వృశ్చిక రాశిలో ప్రవేశించడంతో నెయ్యి, నూనె ధరలు పెరుగుతాయి. ధాన్యం వృద్ధి చెందుతుంది. శుక్రుడు, బుధుడు, రవి గ్రహాలు సంయుక్తంగా తులా రాశిలో ఉంటాయి.
దీంతో ధాన్యాల ధరలు పెరుగుతాయి. వాతావరణంలో మార్పులు సంభవించి మేఘాలు కమ్ముకుంటాయి. కాని వర్షాలు తక్కువగా కురుస్తాయి. దీంతోపాటు నవంబర్ 9న కుజుడు ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశించడంతో వర్షాలు తగ్గే సూచనలు కనపడుతున్నాయి. అలాగే సర్పాల నుంచి భయాందోళనలుంటాయి.
నవంబర్ 16న రవి వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు. దీంతో తూర్పు, దక్షిణ దేశాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. పశ్చిమ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. దీనికి విపరీతంగా ఉత్తర భాగంలోనున్న దేశాలలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
నవంబర్ 17న రాహువు తన వక్రగతితో ధనస్సు రాశిలో ప్రపవేశిస్తున్నాడు. నవంబర్ మధ్యలో హిమాచల ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయి.
రాహువు ధనస్సు రాశిలో ప్రవేశించడంతో ఏనుగులు, గుర్రాల ధరలలో మార్పులు సంభవించి ధరలు పెరిగే సూచనలున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వ్యతిరేక భావనలు నెలకొననున్నాయి.
నవంబర్ 27న శుక్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తుండటంతో ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. మనుషులు సుఖ శాంతులతో, నిర్భయంగా, ఆరోగ్యంగా ఉంటారు.
నవంబర్ 30న బుధుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తుండటంతో జంతువులకు నష్టం వాటిల్లనుంది. నవంబర్ నెలలో వాతావరణ పరిస్థితులలో మార్పులు సంభవించి చలిగాలులు వేగంగా వీస్తాయి.
పర్వతీయ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతోపాటు వడగండ్లు పడే సూచనలున్నాయి. రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్ ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.