Publish Date: Tue, 08 Oct 2019 (16:20 IST)
Updated Date: Tue, 08 Oct 2019 (16:24 IST)
కావలసినవి:
చేప ముక్కలు - నాలుగు
నూనె - తగినంత
వెల్లుల్లి రెబ్బలు - ఏడు
అల్లం ముక్క - చిన్నది
జీలకర్ర - టీస్పూన్
సోంపు - టీస్పూన్
ధనియాలు - రెండు టీస్పూన్లు
నల్లమిరియాలు - రెండు టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - తగినంత
టొమాటో - ఒకటి
కారం - టీస్పూన్
పసుపు - రెండు టీస్పూన్లు
చింతపండు - కొద్దిగా
మొక్కజొన్న పిండి - టేబుల్స్పూన్
తయారీ:
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. ఒక పాన్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి. కొద్దిగా ఉప్పు, టొమాటో ముక్కలు వేయాలి. పసుపు, కారం వేసి తర్వాత చింతపండు రసం పోయాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలపై పోయాలి. తర్వాత మొక్కజొన్న పిండి చల్లుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను పావుగంట పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. తరువాత మరొక పాన్లో నూనె వేసి చేప ముక్కలను వేగించాలి. నిమ్మరసం పండుకొని వేడి వేడిగా తింటే రుచికరంగా ఉంటాయి.
మనీల
Publish Date: Tue, 08 Oct 2019 (16:20 IST)
Updated Date: Tue, 08 Oct 2019 (16:24 IST)