Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం : కావూరి డీసెంట్?

Advertiesment
మన్మోహన్ సింగ్
, గురువారం, 3 అక్టోబరు 2013 (18:02 IST)
File
FILE
కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 5.30 గంటలకు ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ నోట్ టేబుల్ అంశంగా వచ్చే అవకాశం ఉందంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి హాజరవుతున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివ రావు, పళ్ళంరాజులు టి నోట్‌పై డీసెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు పలువురు సీమాంధ్ర విద్యార్థులు ప్రధాని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నివాసంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. భద్రతా సిబ్బంది అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu