బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఝా ఆజాద్ మంగళవారం కన్నుమూశారు. ఆయనకు వయస్సు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
బీహార్లోని భాగల్పూర్ లోక్సభ స్థానం నుంచి ఆయన పార్లమెంట్కు ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించారు. వృద్ధ కాంగ్రెస్ నేతల్లో ఒకరిగా పేరొందిన ఆయన 1988-89 సంవత్సరంలో స్వల్పకాలం బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
అయితే, ఈయనకు కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం దక్కక పోవడంతో ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు. కానీ, అనారోగ్యం కారణంగా అక్కడ క్రియాశీలకంగా పనిచేయలేక పోయారు. ఈయన కుమారుడైన మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ప్రస్తుతం దర్బంగా ఎంపీగా భాజపా తరపున కొనసాగుతున్నారు.