Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్గత భద్రతపై ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రుల సదస్సు!!

Advertiesment
అంతర్గత భద్రతపై ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రుల సదస్సు!!
దేశ అంతర్గత భద్రతపై వచ్చేనెల ఒకటో తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సదస్సును నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ సదస్సును ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తారు.

ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా నక్సల్స్ దుశ్యర్యలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు హెచ్చుమీరిన విషయం తెల్సిందే. ప్రధానంగా దేశంలోని కొన్ని అతివాద గ్రూపులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ దేశ అంతర్గత భద్రకతు పెను సవాల్ విసురుతున్నాయి.

వీటితో పాటు దేశ భద్రతపై తీసుకోవాల్సిన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానమంత్రి మన్మోహన్‌తో పాటు.. కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం, ఆ శాఖ కార్యదర్శి జీకేపిళ్లై, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీపీజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu