Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ఆరోపణలు: ఆర్ఎస్ఎస్

ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ఆరోపణలు: ఆర్ఎస్ఎస్
దేశంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ పార్టీ హిందూ తీవ్రవాద అనే ప్రస్తావన తెరపైకి తెస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. సూరత్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆర్ఎస్ఎస్, హిందూ తీవ్రవాదం తదితిర అంశాలను తెరపైకి తెస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కావాలనే దురుద్దేశపూర్వకంగానే సంఘ్ పరివార్ పేర్లను ప్రస్తావిస్తోందన్నారు. తీవ్రవాద చర్యల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది సంఘ్ సంస్థతో సంబంధం లేని వారనే విషయం ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం సంఘ్‌ సంస్థపైనే విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఓటు బ్యాంకును కోల్పోతుందన్నారు. ముఖ్యంగా, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు తమ ముఖాలను చూపించలేక పోతున్నారని, అందువల్లే వారు మరొకరిపై విమర్శలు చేస్తూ హిందూ తీవ్రవాదం (మిలిటెన్సీ) అనే పదాన్ని వారు కొత్తగా పరిచయం చేశారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu