Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జార్ఖండ్‌లో పాఠశాల భవనాలను పేల్చివేసిన మావోలు

జార్ఖండ్‌లో పాఠశాల భవనాలను పేల్చివేసిన మావోలు
, మంగళవారం, 27 అక్టోబరు 2009 (12:03 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. గిరిది జిల్లాలో రెండు పాఠశాల భవనాలను మందుపాతరలు అమర్చి పేల్చి వేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని, భవనం, ఇతర సామాగ్రి ధ్వంసమైనట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.

మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు వారు తెలిపారు. ధర్పహరి, హిరిధి అనే ప్రాంతాల్లోని రెండు ఉన్నత పాఠశాలల భవనాలు మావోల దుశ్యర్యకు నేలమట్టం అయినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పెట్టిన మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు.

యాంటి నక్సల్స్ ఆపరేషన్ చేపట్టే పోలీసులు ఎక్కువగా పాఠశాల భవనాల్లో బస చేస్తూ ఉంటారు. అందుకే మావోయిస్టులు ఈ భవనాలను టార్గెట్ చేసి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu