Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీఏ ఆర్థిక విధానాలు భేష్: సోనియా గాంధీ

యూపీఏ ఆర్థిక విధానాలు భేష్: సోనియా గాంధీ
FileFILE
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు భేషుగ్గా ఉన్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. అందువల్లే అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం పెద్దగా లేదని ఆమె వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తొలి అంతర్జాతీయ విమానయాన సర్వీసులకు ఆమె శనివారం పచ్చజెండా ఊపారు.

ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్‌పై పెద్దగా లేదన్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థపై పడలేదంటే అందుకు కేంద్రంలోని అధికార యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే ప్రధాన కారణమన్నారు.

ప్రపంచంలోని వివిధ దేశాలతో పోల్చుకుంటే ఆర్థిక మాంద్యం చూపిన ప్రభావం మనపై నామమాత్రమే అన్నారు. అనంతరం మజూమ్‌ నుంచి బారాముల్లాకు నడిచే రైలును ప్రారంభించారు. మజూమ్‌ నుంచి బారాముల్లా మధ్య రైలు ప్రాజెక్టును ఓ సవాల్‌గా తీసుకుని పూర్తి చేసిన రైల్వేమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌, ఇతర రైల్వే అధికారులను ఆమె అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu