పాక్లోని భగత్ సింగ్ ఇంటి పునరుద్ధరణకు రూ. 8కోట్లు!
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2014 (10:48 IST)
పాకిస్థాన్లో ఉన్న భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఇంటి పునరుద్ధరణకు రూ.8 కోట్ల నిధులను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్లో ఉన్న భగత్ సింగ్ పూర్వీకుల ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి భారీ నిధులను విడుదల చేసింది. దీంతో పాటుగా ఆయన పేరు మీద ఉన్న స్కూల్ పనులను కూడా చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 80 మిలియన్లు(రూ.8 కోట్లు)ను విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బంగే గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో ఆ నిధుల్లోని కొంత మొత్తాన్ని వాటికి కేటాయించనున్నారు. ప్రస్తుతం ఫైసలాబాద్ మ్యూజియంలో ఉన్న భగత్ సింగ్కు చెందిన వస్తువులను నిర్మాణ పనులు పూర్తి చేసుకోబోతున్నఇంటికి చేర్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. లాహోర్కు 150 కి.మీ దూరంలో ఉన్న బంగే గ్రామంలో భగత్ సింగ్ 1907, సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు.