Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే నెలలో భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల భేటీ

Advertiesment
వచ్చే నెలలో భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల భేటీ
భారత్, పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం వచ్చే నెలలో జరుగనుంది. ఫిబ్రవరిలో భూటాన్ రాజధాని థింపూలో సార్క్ దేశాల మంత్రుల సమావేశం జరుగనుంది. ఇందులో భారత్, పాకిస్థాన్‌ల విదేశాంగశాఖ కార్యదర్శుల మధ్య చర్చలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ చర్చల ఫలితాన్ని ఆధారంగా పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి భారత్ పర్యటన ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాల తేదీలు ప్రకటించనప్పటికీ, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశముందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎస్.కృష్ణ కూడా సూచన ప్రాయంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ శాఖల కార్యదర్శుల స్థాయి చర్చలు జరగడానికి పాక్ అంగీకరించింది. గత జూలై నెలలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషిని మన దేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశాలు అర్థవంతమైన ఫలితాలిస్తేనే తాను భారత్‌కు వెళతానని ఖురేషీ స్పష్టం చేసిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu