Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రహీత లేకుండా పురస్కారం: జియాబో ఫోటోకి నోబెల్‌

Advertiesment
నోబెల్ గ్రహీత
చైనాలోని ఓస్లా నగరంలో జరిగిన నోబెల్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం చూపరులన ముక్కున వేలేసుకునేలా చేసింది. మానవ హక్కుల కోసం ఉద్యమాలను నడిపిన అసమ్మతి నాయకుడు లియు జియాబొకి ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాకరమైన నోబెల్‌ శాంతి పురస్కారం లభించినప్పటికీ, ఆ పురస్కారాన్ని అందుకునేందుకు ఆయనను చైనీస్‌ ప్రభుత్వం విడుదల చేయలేదు.

దీంతో ఓ ఖాలీ కుర్చీలో జియాబొ ఫొటోని ఉంచి ఆ బహుమతి మొత్తం నగదును కుర్చీలో ఉంచారు. నూరు సంవత్సరాల నోబెల్‌ చరిత్రలో గ్రహీత లేదా వారి ప్రతినిధి అవార్డును స్వీకరించేందుకు రాలేకపోవడం ఇది రెండవసారి.

మొదటిసారి 1936లో జర్మన్‌ జర్నలిస్ట్‌, శాంతి ప్రచారకుడు కార్ల్‌ వన్‌ ఓసిడ్‌జ్కి నాజీ కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపులో చిక్కుకుని ఉండడంవల్ల బహుమతి స్వీకరించేందుకు ఓస్లో రాలేక పోయారు. తాను నివశిస్తున్న దేశ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నిర్బంధాన్ని చవిచూసిన ఒసిడిజ్కి లాగా చైనా నాయకత్వాన్ని నిరసించినందుకు లియు కూడా ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu