Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యుఎన్ అతిథి గృహంపై ఉగ్రవాదుల పంజా: ముగ్గురు ఉద్యోగులు మృతి

Advertiesment
మిలిటెంట్లు
మెషిన్ గన్ల హోరు, బాంబు పేలుళ్ల మోతలతో బుధవారం ఉదయం కాబూల్ నగరం దద్దరిల్లింది. నగరం నడిబొడ్డున ఉన్న యుఎన్ అతిథి గృహాన్ని అధీనంలోకి తెచ్చుకున్న మిలిటెంట్లపై ఆఫ్ఘన్ భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.

ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం అతిథి గృహంలో సుమారు 10 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ విదేశీయులు కావడం గమనార్హం. కాగా ఈ సంఘటనపై ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు.

అతిథి గృహాన్ని దిగ్భంధించినట్లు తెలుసుకున్న వెంటనే ఆఫ్ఘన్ భద్రతా దళం వారిపై ఎదురుదాడికి దిగింది. ఈ దాడిలో ఒక మిలిటెంట్ హతమైనట్లు తెలుస్తోంది. కాగా ముగ్గురు ఉద్యోగులను మిలిటెంట్లు పొట్టనబెట్టుకున్నట్లు సమాచారం. ఓ ఆఫ్ఘన్ పోలీసు అధికారి గాయపడ్డారు.

భవనంలోపల సుమారు ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు ఉన్నారని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘాతుకానికి తమదే బాధ్యత అంటూ తాలిబాన్లు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu