Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైల్లో జగన్‌పై మర్డర్ ప్లాన్...?!! సమన్యాయం అన్నందుకేనట...!!!

జైల్లో జగన్‌పై మర్డర్ ప్లాన్...?!! సమన్యాయం అన్నందుకేనట...!!!
, సోమవారం, 26 ఆగస్టు 2013 (13:41 IST)
FILE
విభజన విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... పరోక్షంగా సమైక్యానికి మద్దతునిస్తూ చంచల్ గూడ జైల్లో జగన్ దీక్ష చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది తెలంగాణ ఖైదీలు జైలులో జగన్ పై దాడి చేసి హతమార్చేందుకు కుట్ర పన్నారంటూ వదంతులు వినిపిస్తున్నాయి.

ఈ విషయమై జైలు అధికారులే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేసేందుకు పలు మార్గాలను వారు అన్వేషిస్తున్నట్లు సమాచారం. లోపల ఉన్న ఖైదీల్లో పలువురు జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా సమాచారం.

జగన్ మోహన్ రెడ్డిని కలిసే అవకాశం వస్తే ఆయనపై మెరుపు దాడికి తెగబడి హత్య చేయాలన్న లక్ష్యంతో వారు ఉన్నారన్న వదంతలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డికి ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతకు మించి అదనపు భద్రతను కల్పించేందుకు జైలు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు రాయలసీమ ఫ్యాక్షనిస్టుల నుంచి కూడా ముప్పు ఉన్నదనీ, కనుక భారీ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu