2014లో మెజార్టీ ఎంపీ సీట్లు జగన్ ఖాతాలోకే : నీల్సన్ సర్వే!
, ఆదివారం, 19 ఆగస్టు 2012 (10:41 IST)
2014
లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్లుతాయని ఇండియా టు-నీన్సన్ సర్వే నిర్వేలో వెల్లడైంది. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ 23 నుంచి 27 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందని తేల్చింది. రాష్ట్రంలో మొత్తం 42 ఎంపీ సీట్లు ఉండగా వీటీలో ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా జగన్ పార్టీ ఏకంగా 23-27 సీట్లు దక్కుతాయని తెలిపింది. అలాగే ఇదే యేడాది రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు పునరావృత్తమవుతాయని ఆ సర్వే ప్రకటించింది. ఇకపోతే.. కేంద్రంలో యూపీఏ సీట్ల సంఖ్య 171 నుంచి 181కు పడిపోతుందని పేర్కొంది. అలాగే, ఎన్డీయే కూటమి 195 నుంచి 205 సీట్లను కైవసం చేసుకోవచ్చని తెలిపింది. ఎన్డీయే కూటమి ఇతర పార్టీల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలిపింది. అయితే, ఈ సర్వే ఫలితాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు.. దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయని తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాదిన్నర సమయం ఉన్నందున అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ ఫలితాలు ఉండొచ్చని నీల్సన్ సర్వే పేర్కొంది. మొత్తమ్మీద వచ్చే ఎన్నికల్లో జగన్ ప్యాక్టర్ మాత్రం బలంగా పని చేయడమే కాకుండా, కేంద్రంలో కీలక పాత్రను జగన్ పోషిస్తారని సర్వే పేర్కొంది.