Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రచ్చబండలో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు: సీఎం కిరణ్

Advertiesment
రచ్చబండలో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు: సీఎం కిరణ్
రచ్చబండ కార్యక్రమం నిర్వహించడంలో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విపక్షాలు రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కోరారు. శ్రీకాకుళంలో రచ్చబండను ప్రారంభిస్తామన్నారు. రచ్చబండను రాజకీయం చేయోద్దని సీఎం కోరారు.

అర్హులైన లబ్దిదారులకు మేలు చేసేందుకే రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం ఆదివారం మీడియాతో వెల్లడించారు. రచ్చబడ్డ కార్యక్రమం ద్వారా 4.70 లక్షల మందికి పింఛన్లను అందచేస్తామని సీఎం తెలిపారు. కొత్తగా అభయహస్తం అమలు చేస్తామన్నారు.

తాత్కాలిక రేషన్ కార్డులతోనే ఆరోగ్యశ్రీ, ఉపకారవేతనాలు వంటి తదితర సేవలు అందిస్తామన్నారు. రచ్చబండ ద్వారా 65 లక్షల మంది సభ్యులకు పావలా వడ్డీ కింద మేలు జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu