Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్లధనంపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది: చంద్రబాబు

Advertiesment
నల్లధనంపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది: చంద్రబాబు
నల్లధనంతో దేశ భద్రతకు ముప్పు ఉందని అత్యున్నత న్యాయస్థానం సూచించినా నిమ్మకు నీరెత్తినట్లు ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు.

నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికే చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు కేంద్రం ప్రత్యేక దౌత్యపరమైన చర్యలు ప్రారంభించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేతలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. దేశంలో అవినీతి లక్షలకోట్లకు చేరిందన్నారు. సత్యం రామలింగరాజుకు, 2జి స్పెక్ట్రం అవినీతికి తేడా ఏముందని ప్రశ్నించారు.

బ్లాక్ మనీ, అవినీతిలపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు చంద్రబాబు నాయుడు ఆదివారం ఓ లేఖ రాశారు. దేశంలో అవినీతి, బ్లాక్ మనీలపై రాజకీయ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దేశంలో అవినీతిని రూపుమాపేందుకు ప్రత్యేక చట్టం తేవాలని చంద్రబాబు ప్రధానిని తన లేఖలో కోరారు.

Share this Story:

Follow Webdunia telugu