Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణపై బడ్జెట్ సమావేశాల్లో తేల్చేస్తాం: కేసీఆర్

Advertiesment
తెలంగాణపై బడ్జెట్ సమావేశాల్లో తేల్చేస్తాం: కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తేల్చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. అప్పటి వరకు దశలవారీగా ఆందోళన కొనసాగిస్తామన్నారు.

ఆయన గురువారం మహబూబ్ నగర్ జడ్చర్లలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని చెప్పలేదని గుర్తు చేశారు. అయినప్పటికీ.. ప్రధాని మన్మోహన్‌ సింగ్ జాప్యం చేస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుంటే పార్లమెంటును స్థంభింపజేస్తామన్నారు. రాజకీయనేతలు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే కేంద్రం తనతంట తాను దిగివస్తుందన్నారు. కానీ, తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సన్నాసి దద్దమ్మ ప్రజాప్రతినిధులు ఇందుకు మొగ్గుచూపడం లేదన్నారు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu