Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శబరి మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా: కేకేఆర్

Advertiesment
శబరి మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా: కేకేఆర్
శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కేరళ నుంచి వచ్చే మృతదేహాలను స్వస్థలాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆదివారం సీఎం తెలిపారు. శబరిమల దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని వైద్యులను, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదిలా ఉంటే శబరిమల ఘటనలో మృతి చెందిన మరో ముగ్గురి మృతదేహాలు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నాయి. ఈ ముగ్గురు మృతదేహాలను హైదరాబాద్‌కు చెందిన శ్రీరామచంద్రమూర్తి, సూర్యులు (చీరాల), కె. గోవిందరావు (శ్రీకాకుళం)లుగా పోలీసులు గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu