జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. గురువారం వెల్లడైన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకృష్ణ కమిటీ వ్యతిరేకం కాదని తన నివేదిక రూపంలో స్పష్టం చేసిందన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో తక్షణం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదేసమయంలో తెలంగాణవాదులు ఎలాంటి ఆందోళనలు చెందవద్దన్నారు. అయితే, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక పని చేయాల్సి ఉందన్నారు.
వీరంతా రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పోతుందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తెలంగాణ ఉద్యమకారుల పోరాటం ఆగదనిద కేసీఆర్ స్పష్టం చేశారు.