Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకృష్ణ కమిటీ నివేదిక నిష్పక్షపాతంగా ఉంది: లగడపాటి

Advertiesment
లగడపాటి రాజగోపాల్
, గురువారం, 6 జనవరి 2011 (13:19 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదిక నిష్పక్షపాత్రంగా ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. అభివృద్ధి, వెనుకుబాటు ప్రాంతీయవారీగా కాకుండా జిల్లాల వారీగా ఉందని కమిటీ చెప్పడం శుభపరిణామమని లగడపాటి వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా తెలుగుతల్లీ కన్నీళ్లు తుడిచి సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను ముడి వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్రంలో అన్ని పార్టీల, అన్ని వర్గాల, ప్రజల అభిప్రాయాలను సేకరించిందని చెప్పారు. కమిటీ సేకరించిన సమాచారంతో సరియైన నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించారని లగడపాటి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu