Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎల్పీ అభిప్రాయం మేరకే తుది నిర్ణయం: మొయిలీ

సీఎల్పీ అభిప్రాయం మేరకే తుది నిర్ణయం: మొయిలీ
, శనివారం, 5 సెప్టెంబరు 2009 (13:00 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని ఎంపికలో కాంగ్రెస్ శాసన సభాపక్షం (సీఎల్పీ) అభిప్రాయాన్ని పరిగణంలోకి తీసుకోకుండా అధిష్టానం తుది నిర్ణయం తీసుకోబోదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. దీనిపై ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వారసుని ఎంపికలో అందరి అభిప్రాయాలు, పరిగణాలను అధిష్టానం తీసుకుంటుందన్నారు.

ఈ విషయంలో అధిష్టానందే తుది నిర్ణయమన్నారు. దివంగతనేత సంతాప దినాలు ముగిసేంత వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఏ ఒక్కరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా, సీఎల్పీ చేసే సూచనలు, సలహాలను అధిష్టానం తప్పకుండా పరిగణంలోకి తీసుకుంటుందని మొయిలీ తేల్చి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu