దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో దుర్గాపూజ చేస్తే...!?
, మంగళవారం, 4 అక్టోబరు 2011 (16:11 IST)
ఈ రోజు దుర్గాష్టమి. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెబుతున్నారు. అయితే మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవి పూజించలేని భక్తులు దుర్గాష్టమి, విజయదశమి నాడు ఈ కింది విధంగా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు, సుఖజీవనం వంటి శుభఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. అలాగే దుర్గాదేవీ పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.ప్రాణ ప్రతిష్ట చేయు విధానం అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి, పళ్లు, ఫలాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్రాణప్రతిష్ట చేసేందుకు పువ్వులు, అక్షింతలను పట్టుకుని అమ్మవారి పాదాలను పట్టుకుని కింది మంత్రములను పఠించాలి.మం ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణ మిహ నో ధేహి భోగమ్జ్యోక్పశ్యేషు సూర్యముచ్చరంత మనుమతే మృడయా న స్స్వస్తిఅమృతంవై ప్రాణా అమృతమాపఃప్రాణానేన యథాస్థాన ముపహ్వయతేఓం అం హ్రీం క్రీం హంస స్సోహంస్వామిని శ్రీ జగన్నాథే యావత్పూజావసానకంతాపత్వ్తం ప్రీతిభావేన యంత్రేస్మిన్ సన్నిధింకురురక్తాంభోదిస్థపోతోల్లస దరుణసరోజాధిరూఢా కరాభైఃపాశం కోదండ మిక్షూద్భవ మణిగుణ మప్యంకుశం పంచబాణాన్భిభ్రామా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీనవక్షోరుహాఢ్యాదేవీబాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానఃసాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీవహాకాళీశ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ అవాహితాభవస్థాపితాభవ సుప్రసన్నాభవ వరదాభవ స్థరాసనం కురు ప్రసీద ప్రసీద ధ్యానం లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాంవిద్యాప్రదాన సమయే శరదిందుశుభ్రాంవిద్వేషి వర్గవిజయేతు తమాలనీలాందేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యేఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండిం శిరఃశంఖం సందధతీంకరైః త్రిణయనాం సర్వాంగభూషాభృతాంయాదేవీ మధుకైటభ ప్రశమనీ యామాహిషోన్మూలినీయాధూమ్రేక్షణ చండముండ దమనీ యారక్తబీజాశినీయాశుంభాది నిశుంభ దైత్యశమనీ యా సిద్ధలక్ష్మీఃవరాతాంత్వాం చంద్ర కళావతంస మకుటాం చారుస్మితాం భావయేశ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమఃఅక్షతలు, పుష్పములను దేవి పాదాల వద్ద ఉంచవలెను.ఆసనం ఈ క్రింది మంత్రమును జపిస్తూ కొద్దిగా దేవిపై అక్షింతలు చల్లవలెను.తాంమ ఆవాహ జాతదేవోలక్ష్మీ మనపగామినీంయస్యాం హిరణ్యం విందేయం గామశ్వరి పురుషానహందుర్గాదేవీ సమాగచ్ఛ సాన్నిధ్య మిహకల్పయబలిపూజాం గృహాణత్వమష్టాభిః శక్తిభ్స్సహతర్వాత దేవి పాదములపై దేవి పాదము వద్ద పుష్పముతో నీటిని చల్లవలెను. ఆచమనీయం ఈ క్రింది మంత్రము చెబుతూ గ్లాసులోని నీటిని పుష్పముతో కొద్దిగా దేవిపై చల్లవలెనుతాం పద్మినీంశరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణేశరణాగతదీనార్త పరిత్రాణ పరాయణేసర్వస్యార్తి హరేదేవీ నారాయణి నమోస్తుతేపంచామృతాభిషేకం క్షీరం (పాలు)ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృషియంభవావాజస్య సంగధేదధి (పెరుగు)దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినఃసురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషిత్ఆజ్యం (నెయ్యి)శుక్రమసి జ్యోతిరసి తేజోసి దెవోవస్సవితోత్పువాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిఃమధు (తేనె)మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవఃమాధ్వీర్నస్సన్త్వౌ షధీఃచక్కెర (పంచదార)స్వాదుః పవస్య దివ్యాయజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్ఫలోదకం (కొబ్బరి నీరు)యాఃఫలినీర్యా ఫలా పుష్పా యాశ్చ పుష్పిణీఃబృహస్పచి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్ హనఃశుద్ధోదకం (మంచినీరు) స్నానంచివరగా అమ్మవారికి మంచినీటిలో స్నానం చేయించి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. తర్వాత పత్తితో చేసిన ఉపవీతం సమర్పించుకోవాలి. తర్వాత ఈ క్రింది మంత్రం చదువుతూ గంధం వేయవలెనుశ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః గంధాం ధారయామిసుగంధ ద్రవ్యాణి ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుంజాయా హేతిం పరిబాధమానాఃహస్తేఘ్నో విశ్వావయునాని విద్వాన్పుమాన్పుమాంసంపరిపాతువిశ్వతఃశ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరి గోరోజనాది సుగంధద్రవ్యాణి సమర్పయామి.ఆభరణాణి (నగలు)తర్వాత అమ్మవారికి ఈ క్రింది మంత్రం చెబుతూ నగలు సమర్పించుకోవాలి.శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః సర్వభరణాణి సమర్పయామిపుష్పాణి (పూలమాలలు)ఈ క్రింది మంత్రం చదువుతూ సుగంధ పూలమాలలను అలంకరించాలి. శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.అధాంగ పూజ ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామిఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామిఓం అపర్ణాయై నమః జానునీ పూజయామిఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామిఓం పార్వత్యై నమః కటిం పూజయామిఓం ఆర్యాయై నమః నాభిం పూజయామిఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామిఓం మంగళాయై నమః కుక్షిం పూజయామిఓం శివాయై నమః హృదయం పూజయామిఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామిఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామిఓం కాళ్యై నమః బాహూ పూజయామిఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామిఓం వరదాయై నమః ముఖం పూజయామిఓం సువణ్యై నమః నాసికం పూజయామిఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామిఓం అంబికాయై నమః శిరః పూజయామిఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామిధూపం (అగరవత్తులు) తర్వాత అమ్మవారికి అగరవత్తులను సమర్పించుకోవాలి. శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి.దీపం అమ్మవారి దీపం వెలిగించి క్రింది మంత్రమును చదవాలి. శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామిఅని చెబుతూ నీటిని పళ్లెములో విడువలెనునైవేద్యం తర్వాత నైవేద్యం సమర్పించి, తాంబూలాలను ఇవ్వాలి.కర్పూరనీరాజనంఈ క్రింది మంత్రమును జపిస్తూ హారతి ఇవ్వవలెను.సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతుశ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి.మంత్రపుష్పమ్ చేతిలో అక్షింతలు, పువ్వులను ఉంచుకుని మంత్రపుష్పమ్ చెప్పవలెను. ఇక్కడ పెద్ద మంత్రపుష్పమ్ లేదా చిన్న మంత్రపుష్పమ్ చెప్పవలెను లేదా శ్రీ సూక్త ఫలమును పఠించవలెను. తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయవలెను. అనంతరం తీర్థం పుచ్చుకుంటూ ఈ మంత్రాలను జపించవలెను.మం అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్తపాపక్షయకరంశ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గాపరాదేవీ పాదోదకం పావనం శుభమ్ఉద్వాసన ఈ క్రింది మంత్రము జపించుచూ ఉద్వాసన పలుకవలెనుమం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్తేహనాకం మహిమానస్సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాఃశ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః యథాస్థాన ముద్వాసయామి.