Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లికి రెండో పెళ్లి చేయించిన తనయుడు.. ఎక్కడ?

తల్లికి రెండో పెళ్లి చేయించిన తనయుడు.. ఎక్కడ?
, సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:36 IST)
తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడి కథ తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లా తెన్ కాశీకి చెందిన సుభాషిణి అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇప్పటికే వివాహమై విడాకులు పొందారు. ఈమెకు దర్శన్ అనే తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో ఆమె తిరుమంగళానికి చెందిన సినిమా రంగంలో పనిచేసే చిత్రకారుడు ఆదిష్‌తో ప్రేమలో పడింది.
 
ఇరువురూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల వారు సమ్మతించలేదు. కానీ సుభాషిణి కుమారుడు దర్శన్ మాత్రం పూర్తిగా సమ్మతిస్తూ వారి వివాహానికి మద్ధతు తెలిపాడు. 
 
తన తల్లి సుఖంగా ఉండాలని పెద్ద అరిందాలా చెప్పాడు. తన చేతుల మీదుగా మంగళసూత్రం అందించి తన తల్లి ప్రేమ వివాహం జరిపించి అందరి మన్ననలు పొందాడు. చిన్నవయసులో పెద్దమనసుతో తల్లి ఆనందం కోసం దర్శన్ చేయూత ఇవ్వడం స్థానికులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైన మూడో రోజే విడాకులు.. మూడు ముళ్ల బంధం అలా తెగిపోయింది..