Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శేఖర్ రెడ్డికి కొత్త నోట్లిచ్చింది తిరుపతి బ్యాంకు అధికారులే... ఎంత ధైర్యం?

కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించి ఐటీ అధికారులకు అడ్డంగా బుక్కయిన తితిదే మాజీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి బాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. ఇప్పటివరకు శేఖర్ రెడ్డి వద్ద 131 కోట్ల రూపాయల డబ్బులతో పాటు 160 కిలోలకుపైగా బంగారాన్ని ఐటీ అధికారులు స్

Advertiesment
sekhar reddy
, గురువారం, 15 డిశెంబరు 2016 (13:52 IST)
కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించి ఐటీ అధికారులకు అడ్డంగా బుక్కయిన తితిదే మాజీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి బాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. ఇప్పటివరకు శేఖర్ రెడ్డి వద్ద 131 కోట్ల రూపాయల డబ్బులతో పాటు 160 కిలోలకుపైగా బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే త్రవ్వే కొద్దీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి.
 
శేఖర్ రెడ్డి నుంచి ఐటీ స్వాధీనం చేసుకున్న నగదులో 50 కోట్ల రూపాయలు కొత్త నోట్లే ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించి ఆశ్చర్యపోయారు. బ్యాంకులలో ఉండాల్సిన ఇంత మొత్తం, అందులోను కొత్త నోట్లు నేరుగా శేఖర్‌ రెడ్డి ఇంటికి చేరుకోవడం ఏమిటని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసును సిబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తుండగా లోతుగా విచారణ కొనసాగుతోంది.
 
శేఖర్ రెడ్డి ఇప్పటికే తితిదే పాలకమండలి సభ్యులుగా ఉండి చివరకు అక్రమ ఆస్తుల వ్యవహారంలో పదవి పోగొట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ముందు నుంచీ తిరుపతిలో పరిచయాలు ఏర్పరచుకున్న శేఖర్ రెడ్డి చివరకు తన వద్దనున్న కొత్త నోట్లన్నీ తిరుపతి బ్యాంకుల నుంచీ తీసుకెళ్ళినట్లు సిబీఐ, ఈడీ విచారణలో తేలింది. కొత్త నోట్లలో కొన్ని నేరుగా ఆర్‌బిఐ నుంచి శేఖర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళగా మరికొన్ని తిరుపతిలోని ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంకు, తమిళనాడు మర్కెంటైల్‌ బ్యాంకుల నుంచి వెళ్ళినట్లు గుర్తించారు. దీనిపై ఇప్పటికే బ్యాంకు మేనేజర్లను విచారించిన ఈడీ, సిబీఐ మరింత లోతుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
తిరుపతిలోని ప్రధాన బ్రాంచ్‌లకు సంబంధించిన మూడు బ్యాంకుల మేనేజర్లను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే తమ విచారణలో తమకేం సంబంధం లేదని సీబీఐకు బ్యాంకు అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. బ్యాంకు మేనేజర్లు ఎంత వాదించినా డబ్బులు మాత్రం వారి నుంచే కమిషన్ల రూపంలో వెళ్లినట్లు గుర్తించారు. మొత్తం మీద శేఖర్ రెడ్డి వ్యవహారం ముగ్గురు మేనేజర్ల మెడకు చుట్టుకోనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ 'దేవత' అవుతుందా? జయ సమాధి వద్ద తలనీలాలు, పెండ్లిళ్లు