Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భసంచి లేదు.. అయినా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఎలా?

Advertiesment
గర్భసంచి లేదు.. అయినా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఎలా?
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (18:59 IST)
అవును.. ఆమెకు గర్భసంచి లేదు.. అయినా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గర్భసంచి లేని మహిళకు చర్మం ద్వారా.. అండోత్పత్తి చేసి.. అద్దె గర్భం ద్వారా శిశువును జన్మించేలా చేశారు.. చెన్నై వైద్యులు. భారత్‌లోనే గర్భ సంచిలేని మహిళకు సంతానం కలగడం ఇదే తొలిసారి. ఈ రికార్డును వైద్యురాలు కమలా సెల్వరాజ్.. ఆమె కుమార్తె, వైద్యురాలైన ప్రియ సాధించారు. 
 
దీనిపై వైద్యులు కమలా సెల్వరాజ్ మాట్లాడుతూ.. 27 ఏళ్ల సదరు మహిళకు గర్భసంచిలో క్యాన్సర్ రావడంతో.. ఆపరేషన్ ద్వారా క్యాన్సర్ కణాలు శోకని అండాలను వేరు చేసి.. చర్మం ద్వారా వాటిని అద్దె గర్భంలోకి పంపి.. తద్వారా శిశువు జన్మించేలా చేశారు. క్యాన్సర్ సోకిన మహిళ చర్మం నుంచి అల్ట్రా సౌండ్ సాయంతో ఆమె పురుషుని వీర్యకణాలతో అండోత్పత్తి చేశామని కమల చెప్పారు. 
 
ఇలా టెస్టు ట్యూబ్ ద్వారా అద్దె గర్భంలోకి పంపి పండంటి బిడ్డ పుట్టేలా చేశామని కమల తెలిపారు. మూడేళ్ల పాటు జరిగిన చికిత్స జరిగిందని.. ఈ నేపథ్యంలో శనివారం అద్దె గర్భం ద్వారా పండంటి పాపాయి పుట్టిందని కమల తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..