Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంపీలు.. మీ నియోజకవర్గాల్లో వారం రోజులు ఉండాల్సిందే : నరేంద్ర మోడీ

Advertiesment
PM Modi
, మంగళవారం, 10 మే 2016 (14:53 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సూచన చేశారు. ఆయన సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 26వ తేదీతో రెండేళ్లు అవుతున్న తరుణంలో ఈ సలహా చేశారు. పార్లమెంటేరియన్లు తమ తమ నియోజకవర్గాల్లో కనీసం వారం రోజుల పాటు గడపాలని.. అక్కడి సమస్యలు తెలుసుకోవాలని కోరారు.
 
కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా మోడీ భాజపా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసినట్టు సమాచారం. అలాగే ఏడు రోజుల పాటు తమ తమ నియోజకవర్గాల్లో ఉండి రాత్రి కూడా అక్కడే బస చేసి సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు మరింత దగ్గరవ్వాలని కోరారు.
 
అలాగే, తాను ప్రధాని అయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన అన్ని రకాల పథకాలను ప్రజలకు వివరిస్తూ.. వారికి మరింత చేరువయ్యేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాఖండ్ రాజకీయం : సొంత పార్టీలకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు