Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని మోడీకి భారీగా బహుమతులు.. వేలం పాటలు ప్రారంభం...

Modi

ఠాగూర్

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (11:07 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను వేలం వేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. పారిలింపిక్స్ విజేతలు ఇచ్చిన స్పోర్ట్స్ షూ మొదలుకొని వెండి వీణ, రామమందిరం ప్రతిమ వంటి 600 రకాల వస్తువులు వేలం వేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వేలం వేస్తున్న వస్తువుల్లో రూ.600ల నుంచి రూ.8.26 లక్షలు విలువ చేసేవి ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజైన సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. 
 
సోమవారం మంత్రి షెకావత్ వేలం వేసే వస్తువులు ప్రదర్శనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ప్రధాని మోడీ తనకు లభించే అన్ని బహుమతులను వేలం వేసే కొత్త సంస్కృతిని ప్రారంభించారన్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇలానే చేసేవారని తెలిపారు. ఇలా వేలం నిర్వహించడం ఇది ఆరోసారని వెల్లడించారు. బహుమతుల వేలం ద్వారా వచ్చే డబ్బును గంగానది ప్రక్షాళనకుగానూ గంగాధికి విరాళంగా అందజేస్తామని ఆయన వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్ - త్వరలోనే ఆఫర్ల వెల్లడి