Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శోభనం రోజున చికెన్ కూర కలిపిన అన్నంలో విషం కలుపుకుని..?

Advertiesment
Newly-Married Couple
, బుధవారం, 23 జూన్ 2021 (14:44 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరు.. కానీ ఏమైందో ఏమో కానీ శోభనం రోజు రాత్రే అనూహ్య ఘటన జరిగింది. వధూవరులు ఇద్దరూ విషం తాగేశారు. విషమ పరిస్థితుల్లో ఉన్న వాళ్లిద్దరినీ బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సోనేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్‌షెడ్‌పూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల శాంతీ దేవికి, గోపాల్‌గంజ్ నగరంలోని మిర్జ్‌గంజ్‌కు చెందిన ముకేష్ కుమార్ సింగ్ అనే 30 ఏళ్ల వ్యక్తికి శనివారం ఓ గుడిలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం ఆ దంపతులను ఇంటికి తీసుకెళ్లారు. 
 
రాత్రి భోజన కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అయితే ఏమైందో ఏమో కానీ సోమవారం తెల్లవారుజామున వారిని నిద్రలేపేందుకు వెళ్లిన బంధువులకు అపస్మారక స్థితిలో కనిపించారు.
 
పక్కనే చికెన్ కూర కలిపిన అన్నం కూడా ఉంది. దాంట్లోనే విషం కలుపుకుని ఇద్దరూ తిని ఉంటారని అంతా భావిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ పెళ్లే అయినా ఎందుకు ఇలా చేశారన్నది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. వాళ్లు కోలుకుంటేనే కానీ అసలేం జరిగిందన్నది తెలియదని బంధువులు వాపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకుతో పాటు 12 అంతస్తుల భవనం నుంచి దూకిన మహిళ!