Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదు.... చిత్రహింసల వల్లే మృతి!

భారత స్వాతంత్ర్యపోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై నాటి నుంచి నేటి వరకు వివిధ రకాల చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా... ఆయన మృతిపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని,

విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదు.... చిత్రహింసల వల్లే మృతి!
, శనివారం, 7 జనవరి 2017 (05:26 IST)
భారత స్వాతంత్ర్యపోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై నాటి నుంచి నేటి వరకు వివిధ రకాల చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా... ఆయన మృతిపై సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్‌ యూనియన్‌లో బ్రిటిష్‌ అధికారుల ఇంటరాగేషన్‌లో చిత్రహింసల వల్ల మృతి చెందారని తాజా వాదన తెరపైకి వచ్చింది. 
 
రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ జీడీ బక్షీ రాసిన 'బోస్‌- ది ఇండియన్ సమురాయ్‌' పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జపాన్ నుంచి తప్పించుకుని సైబీరియాకు వెళ్లిన నేతాజీ అక్కడ ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేశారని, అక్కడ నుంచి నేతాజీ తప్పించుకున్న విషయం తెలుసుకున్న బ్రిటిష్‌ అధికారులు.. ఆయనను విచారణకు అనుమతించాలంటూ సోవియట్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సోవియట్ అధికారుల విచారణకు నేతాజీని అప్పగించగా, వారి పెట్టిన చిత్రహింసల వల్ల ఆయన ప్రాణాలు విడిచారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబును రాళ్లతో కొడతారు... వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు