Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజీవ్ తరహాలో మోడీ హత్యకు భారీ కుట్ర.. ప్లాన్ ఎవరిదంటే?

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు పక్కా పథకం ప్రకారం హత్య చేశారు. ఇలాంటి ప్లాన్ ప్రకారమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం హత్య చేయాలని మావోయిస్టులు వ్యూహం రచిస్తున్నారని తాజాగా వెల్లడైం

Advertiesment
Maoist
, శుక్రవారం, 8 జూన్ 2018 (14:54 IST)
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు పక్కా పథకం ప్రకారం హత్య చేశారు. ఇలాంటి ప్లాన్ ప్రకారమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం హత్య చేయాలని మావోయిస్టులు వ్యూహం రచిస్తున్నారని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని పూణే పోలీసులు వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ లేఖను శుక్రవారం విడుదల చేశారు. మోడీ హత్యకు కుట్ర పన్నడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మావోయిస్టులు ఆ లేఖను గతేడాది ఏప్రిల్‌లో రాశారు.
 
ఈ యేడాది జనవరి మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్‌ దావలే, సురేంద్ర గాట్లింగ్‌, సోమా సేన్‌, మహేష్‌ రౌత్‌, రోనా జాకబ్‌ విల్సన్‌ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే జాకబ్‌ విల్సన్‌ను అరెస్ట్‌ చేసిన ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. మోడీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉంది.
 
ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ ఐసిస్‌ గత మే నెలలో కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఐసిస్‌ ఉగ్రకుట్రను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) భగ్నం చేసింది. స్నిప్పర్‌ రైఫిల్‌తో మోడీ కాల్చి హత్యచేయాలని మిలిటెంట్లు భావించారని ఏటీఎస్‌ బృందం ఇటీవల వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాలా అందంగా ఉన్నావ్.. పర్సనల్‌గా వచ్చి కలవరాదూ... : మహిళా కార్పొరేటర్‌‌తో టీడీపీ నేత