Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుక్కపిల్ల కరిచిందనీ.. శునకం కాళ్లను రంపంతో కోసిన కిరాతకుడు

ఢిల్లీలో దారుణం జరిగింది. కుక్క కరిచిందనీ.. ఆ శునకం కాళ్ళను రంపంతో కోసిన ఘటన ఢిల్లీ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... రెండు నెలల వయసున్న కుక్కపిల్ల ఢిల్లీలోని ద్వారక

Advertiesment
Delhi resident
, బుధవారం, 7 డిశెంబరు 2016 (16:33 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. కుక్క కరిచిందనీ.. ఆ శునకం కాళ్ళను రంపంతో కోసిన ఘటన ఢిల్లీ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... రెండు నెలల వయసున్న కుక్కపిల్ల ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నివశించే ప్రమోద్ అనే నిరుద్యోగి ఇంట్లోకి ప్రవేశించింది. నిత్యం మద్యం మత్తులో ఉండే ఆ వ్యక్తి కుక్కపిల్లను పిలిచి, దానికి కొంత ఆహారం కూడా వేశాడు. 
 
అయితే, ఆహారం తీసుకోవాలన్న తొందరలో.. ఆ కుక్కపిల్ల అతడి కాళ్లమీద తన ముందరి కాళ్లతో కొద్దిగా గీరడంతో పాటు.. కొరికింది. వెంటనే అతడికి కోపం వచ్చి, రంపం తీసుకుని దాన్ని ముందుగా కట్టేసి, ఒక ముందు కాలు, ఒక వెనక కాలు కోసేశాడని జంతువుల హక్కుల కార్యకర్త గౌరవ్ శర్మ ఆరోపించారు.
 
ప్రమోద్ ఇంటి సమీపంలో ఉండే ఓ బాలిక అతడి క్రూరత్వం గురించి తనకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం తెలిసిందని గౌరవ్ అన్నారు. కుక్కపిల్లను రక్షించడానికి తాను అక్కడకు వెళ్లగా, ప్రమోద్ భార్య జరిగిన విషయం మొత్తాన్ని వివరించిందన్నారు. కొన్ని నెలల క్రితం ప్రమోద్ ఒక కోతిని ఇంటికి తీసుకొచ్చి, తర్వాత దాన్ని నరికేశాడని కూడా ఆమె ఆరోపించింది. అయితే ఆ విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే, ఈ నేరానికి అతడికి గరిష్ఠంగా 50 రూపాయల జరిమానా మాత్రమే పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తన మెడకు తనే ఉచ్చు బిగించుకున్న 'గాలి'..? రూ.100 కోట్ల పాతనోట్లు పని పట్టాయ్...