Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలతో బలవంతంగా భిక్షాటనం.. 45 రోజుల్లో రూ.2.5లక్షలు సంపాదించింది..

Begging kids

సెల్వి

, బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (11:03 IST)
Begging kids
పిల్లలతో బలవంతంగా భిక్షాటనం చేయించి 45 రోజుల్లో ఓ మహిళ రూ.2.5లక్షలు సంపాదించింది. 45రోజుల్లో రూ.2.5లక్షలు సంపాదించానని.. అందులో రూ.లక్షను తన అత్తమామలకు పంపానని.. రూ.50,000 బ్యాంక్ ఖాతాలో జమ చేశానని మధ్యప్రదేశ్ ఇంద్ర వెల్లడించింది. 
 
అలాగే మరో 50వేల రూపాయలను ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేశానని తెలిపింది. 40 ఏళ్ల మహిళ తన ఎనిమిదేళ్ల కుమార్తె, ఇద్దరు కుమారులను ఇండోర్ వీధుల్లో అడుక్కునేలా చేసి కేవలం 45 రోజుల్లో రూ.2.5 లక్షలు సంపాదించగలిగింది.
 
నగరంలో భిక్షాటనలో నిమగ్నమైన సుమారు 150 మంది వ్యక్తుల బృందంలో భాగమైన మహిళ కుటుంబం రాజస్థాన్‌లో భూమి, రెండంతస్తుల ఇల్లు కలిగి ఉందని ఒక ఎన్జీవో పేర్కొంది.
 
ఇండోర్-ఉజ్జయిని రోడ్డులోని లువ్-కుష్ కూడలిలో ఇంద్రాబాయి అనే మహిళ ఇటీవల భిక్షాటన చేస్తూ కనిపించింది. ఆమె వద్ద రూ. 19,200 నగదు దొరికిందని ప్రవేశ్ అనే సంస్థ అధ్యక్షురాలు రూపాలి జైన్ తెలిపారు.

ఇండోర్‌ను బిచ్చగాళ్ల రహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఐదుగురు పిల్లల తల్లి తన ఎనిమిదేళ్ల కుమార్తెతో సహా ముగ్గురు పిల్లలను నగర వీధుల్లో భిక్షాటన చేయమని బలవంతం చేసింది.
 
బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంచగా, తొమ్మిది, 10 సంవత్సరాల వయస్సు గల మహిళ కుమారులు ఆమె బృందాన్ని చూసి పారిపోయారని, ఆమె మిగిలిన పిల్లలు రాజస్థాన్‌లో ఉన్నారని జైన్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే ప్రాజెక్టుల కోసం బకాయిలు.. అగ్రస్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్