Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌‍కౌంటర్ చేస్తే రూ.1,11,11,111 రివార్డుగా ఇస్తాం...

Lawrence Bishnoi

ఠాగూర్

, మంగళవారం, 22 అక్టోబరు 2024 (10:56 IST)
ప్రముఖ గ్యాంగ్‌‍స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసే పోలీస్ అధికారికి రూ.1,11,11,111 (రూ.1.11 కోట్లు) నగదు బహుమతిగా ఇస్తామని క్షత్రిక కర్ణిసేన ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ అమరవీరుడు బాబా సిద్ధిఖీ హత్యకు లారెన్స్ బిష్ణోయ్‌ ప్రధాన కారణమని ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి జైలులో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్... జైలు నుంచే బెదిరింపులకు పాల్పడుతున్నారని, అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. 
 
గత 2023 డిసెంబరు 5వ తేదీన అప్పటి కర్ణిసేన చీప్ అయిన సుఖ్‌దేవ్ సింగ్‌ను దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే హత్యకు తామే కారణమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సరిహద్దుల వద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లారెన్స్ బిష్ణోయ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం సబర్మతి జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్ నివాసం ఎదుట కాల్పులు జరిపింది కూడా బిష్ణోయ్ ముఠా సభ్యులే కావడం గమనార్హం. అలాగే, ముంబైలో ఇటీవల జరిగిన మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని కూడా ఈ ముఠా సభ్యులో కాల్చి చంపిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్.. ఎందుకంటే?