Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మో శశీ...? జయ వైద్యానికి ఒక రోజుకి రూ.1,00,00,000.. 30 అద్దె గదులు ఎందుకు?

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. దానిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు అనారోగ్యం అయితే అపోలో ఆసుపత్రిలో 30 అద్

అమ్మో శశీ...? జయ వైద్యానికి ఒక రోజుకి రూ.1,00,00,000.. 30 అద్దె గదులు ఎందుకు?
, శనివారం, 10 డిశెంబరు 2016 (12:59 IST)
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. దానిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు అనారోగ్యం అయితే అపోలో ఆసుపత్రిలో 30 అద్దె గదులు తీసుకున్నారు శశికళ. అసలు శశికళ ఏ హక్కుతో ఇదంతా చేశారన్నది ప్రశ్న. 
 
మరోవైపు శశికళ తీసుకున్న ఈ 30 అద్దె గదులకు అయిన ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేట్లు బిల్లు వచ్చింది. జయకు చికిత్స అందించిన 75 రోజుల్లో మొత్తం రూ. 80 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు అపోలో ఆసుపత్రి ఇచ్చిన బిల్లును బట్టి తెలుస్తోంది. అంటే... రోజుకు సరాసరి రూ. 1,00,00,000 ఖర్చయినట్లు బిల్లును బట్టి అర్థమవుతుంది. లండన్, సింగపూర్ వైద్యుల ఖర్చును అతి భారీగా చూపినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో జయకు అయిన ఖర్చులో ఇప్పటికే రూ.8 కోట్లను తమిళనాడు ప్రభుత్వం చెల్లించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత కెరీర్ ఎంజీఆర్ వల్లే నాశనం.. మరణించేటప్పుడూ ప్రశాంతత లేకుండా చేసిన శశికళ.. నిజమేనా?