పీవీ నుంచి జయలలిత వరకు అదే కంపెనీ.. ఆ శవపేటిక ప్రత్యేకత ఏంటో తెలుసా?
మాజీ ప్రధాని దివంగత పీవీ నరసిహా రావు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఖననం చేసేందుకు ఒకే కంపెనీ శవపేటికలను తయారు చేసింది. గంధపు చెక్కలతో శవపేటికలను తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. పైగ
మాజీ ప్రధాని దివంగత పీవీ నరసిహా రావు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఖననం చేసేందుకు ఒకే కంపెనీ శవపేటికలను తయారు చేసింది. గంధపు చెక్కలతో శవపేటికలను తయారు చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. పైగా, ఈ శవపేటికలో ఉంచిన పార్థివదేహం మూడు నాలుగు రోజుల పాటు చెడిపోకుండా ఉంచడం దీని ప్రత్యేకత.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన వెంటనే ప్రత్యేక పేటికను రూపొందించే పనిని ఫ్లైయింగ్ స్క్వాడ్ అండ్ హోమేజ్ కంపెనీకి అప్పగించారు. దీంతో ప్రత్యేకంగా గందపు చెక్కలతో ఆ కంపెనీ శవపేటికను రూపొందించి ఇచ్చింది.
ఈ పేటికలోపల 0 నుంచి 5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను కొనసాగించగలిగితే మూడు రోజుల వరకు కూడా మృతదేహం చెక్కు చెదరదు. ఈ శవపేటిక ప్రత్యేకత అని ఆ కంపెనీ ప్రతినిధులు చెపుతున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్, మనోరమ వంటి ప్రముఖులకు కూడా ఈ కంపెనీనే పేటికలను రూపొందించింది.
'జయలలిత కోసం రూపొందించిన పేటికను హెవీ డ్యూటీ కంప్రెజర్, ఫ్రీజర్ బాక్స్ రూపొందించాం. ఇది శరీరాన్ని త్వరగా చెడిపోకుండా ఉంచుతుంది' అని ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ఎంఎం శాంతకుమార్ తెలిపారు. 1994లో పేటికలను తయారు చేసే లైసెన్సులు పొందిన తాము ఇప్పటివరకు 500 మంది ప్రముఖుల కోసం ప్రత్యేక పేటికలను తయారు చేయించి ఇచ్చామని వివరించారు.