Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

Advertiesment
air india

ఠాగూర్

, శుక్రవారం, 13 జూన్ 2025 (15:32 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశంలో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 
 
తొలుత తాత్కాలికంగా సేవలను నిలిపివేసి, ఆ తర్వాత భద్రతను సమీక్షించిన తర్వాత ఈ విమానం సేవలను పూర్తిగా నిలిపివేయాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా తాజాగా దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎయిరిండియాతోపాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విమాన ప్రయాణికులు 241తో కలిపి మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన గగనతలంలో ప్రమాణాల భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినపుడు బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నమైనవనే అభిప్రాయం ఉంది. కానీ, అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఈ విమానాల భద్రతపై ఇపుడు అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

BSNL: దేశంలో లక్ష బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్ల ఏర్పాటు చేయాలని ప్రణాళిక