Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంపూర్ణ మెజార్టీ వచ్చిందిగా.. ఇక రామమందిర నిర్మాణం మొదలెట్టండి : శివసేన

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్యలో రామాలయం నిర్మించాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు భారతీయ జనతా పా

Advertiesment
సంపూర్ణ మెజార్టీ వచ్చిందిగా.. ఇక రామమందిర నిర్మాణం మొదలెట్టండి : శివసేన
, ఆదివారం, 12 మార్చి 2017 (09:21 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్యలో రామాలయం నిర్మించాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీని కోరింది. 
 
శనివారం వెల్లడైన యూపీ ఎన్నికల ఫలితాల్లో అంచనాలకు భిన్నంగా ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా బీజేపీ ఏకంగా 325 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో శివ‌సేన పార్టీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ, బీజేపీకి అభినంద‌న‌లు తెలుపుతూ, రామ మందిరం అంశాన్ని మ‌రోసారి తెర‌పైకి తెచ్చింది. 
 
ఇదే అంశంపై శివ‌సేన‌ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్ మాట్లాడుతూ.. ఇక‌ త్వరలో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తారని తాము ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తంచేశారు. ఇంతకుమించిన మంచి తరుణం మరొకటి లేదన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని ఆయన గట్టిగా కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చక్రం తిప్పిన మనోహర్ పారీకర్ .. బీజేపీ ఖాతాలో గోవా