Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలపై నేరాలకు అడ్డాగా మారిన ఢిల్లీ.. మహిళను వెంబడించిన ఆటో డ్రైవర్.. కత్తితో పొడిచి?

ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతిని నడిరోడ్డుపైనే ఓ యువకుడు పలుమార్లు కత్తితో పొడిచిన ఘటన మరవక ముందే అలాంటి ఘటన పునరావృతమైంది.

Advertiesment
Gurgaon
, సోమవారం, 24 అక్టోబరు 2016 (19:17 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్భయ లాంటి ఘటన జరిగినా.. మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు ఓవైపు వరకట్నం, లైంగిక వేధింపులు మరోవైపు.. గృహహింస, ప్రేమోన్మాదం ఇంకోవైపు.. ఇలా.. మహిళలపై నేరాలకు ఢిల్లీ అడ్డాగా మారిపోయింది. తాజాగా ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతిని నడిరోడ్డుపైనే ఓ యువకుడు పలుమార్లు కత్తితో పొడిచిన ఘటన మరవక ముందే అలాంటి ఘటన పునరావృతమైంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఎంజీ రోడ్డు స్టేషన్ వద్ద రోడ్డుపై నడుస్తున్న పింకీ దేవి (34) అనే మహిళను గత కొంత కాలంగా వేధిస్తున్న ఆటోడ్రైవర్ జితేందర్‌ ఆమెను వెంబడించడం మొదలెట్టాడు. అతని వేధింపులపై గతంలో భర్త మాన్ సింగ్‌కు గతంలో చెప్పేసిన పింకీ దేవి.. అతను వెంబడిస్తున్న సంగతిని ఫోను ద్వారా చెప్పింది. భర్తతో మాట్లాడుతుండగానే ఆమెను సమీపించిన జితేందర్ ఆమెను పలుసార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు.
 
సమాచారం అందుకున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ సిబ్బంది వెంటనే నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఆటో డ్రైవర్‌చే దాడికి గురైన పింకీ దేవి ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేుసకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర‌బాబు ఓకే అన్నారు... ఏపీ అసెంబ్లీ మాకిచ్చేయండి : గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌