Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Son: రూ.20 ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపేసిన కొడుకు

Advertiesment
Crime

సెల్వి

, మంగళవారం, 22 జులై 2025 (14:19 IST)
Crime
చిన్న చిన్న కారణాలకే అకృత్యాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. మద్యానికి బానిసై కన్నతల్లిని ఓ కుమారుడు హతమార్చాడు. కేవలం రూ.20ల కోసం కన్నతల్లిని కడతేర్చాడు. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని నుహ్ జిల్లాలో 56 ఏళ్ల తల్లికి ఓ కొడుకు ఉన్నాడు. 
 
తల్లిని కొడుకు రూ.20 అడగడంతో ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. దీంతో కొడుకు తల్లిని దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. ఆ తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందింది. 
 
అయితే కుమారుడు ఏం చేయకుండా మద్యం, గంజాయి వంటి వాటికి బాగా అలవాటు పడ్డాడు. పోలీసులు వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన నిందితుడు తన తల్లిని రూ. 20 అడిగాడు. తన దగ్గర చిల్లర లేదని, రూ. 500 నోటు మాత్రమే ఉందని తల్లి రజియా వివరించింది. 
 
ఇంకా మరుసటి రోజు ఉదయం డబ్బు ఇస్తానని చెప్పింది. అడిగిన వెంటనే 20 రూపాయలు ఇవ్వలేదనే కోపంతో, అతను మొదట ఆమెపై ఇటుకతో దాడి చేసి గాయపరిచాడు. ఆ తర్వాత గొడ్డలితో ఆమె గొంతు కోసి, అక్కడికక్కడే చంపాడు. దాడి తర్వాత, జంషెడ్ అక్కడి నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ప్రేమ అంగీకరించవా? చూడు నిన్ను ఏం చేస్తానో అంటూ బాలిక మెడపై కత్తి పెట్టిన ఉన్మాది (video)