Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దోషిగా డేరా బాబా... మరో నలుగురిని కూడా దోషులుగా తేల్చిన కోర్టు

దోషిగా డేరా బాబా... మరో నలుగురిని కూడా దోషులుగా తేల్చిన కోర్టు
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:27 IST)
డేరా బాబా అలియాస్.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరో నలుగురిని ఓ హత్య కేసులో దోషులుగా హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. అక్టోబర్ 12న వారికి శిక్ష ఖరారు చేయనున్నట్టు తెలిపింది. 
 
వివరాల్లోకెళ్తే.. 2002లో రంజిత్ సింగ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. దాంతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు.. రామ్ రహీమ్ సింగ్ తో పాటు క్రిష్ణలాల్, జస్వీర్, సబ్దిల్, అవతార్ లను దోషులుగా తేల్చింది. అయితే నిందితుల్లో ఒకరు ఇప్పటికే మరణించారు. ఇక జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య సహా మహిళా అనుచరులపై లైంగికదాడి కేసులో ఇప్పటికే డేరా బాబా శిక్ష అనుభవిస్తూ సునారియా జైలులో ఉన్నారు. 
 
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ఆశ్రమంలో తన ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీ చూసేందుకు వచ్చిన 17 యేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం..