Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా అమ్మ.. మిగతావారికంటే ఎక్కువ తిండి పెట్టేది.. పత్రికలు పంపిణీ చేసేవాడిని..!

Advertiesment
APJ Abdul Kalam
, మంగళవారం, 28 జులై 2015 (13:57 IST)
గొప్ప ప్రొఫెసర్.. గొప్ప శాస్త్రవేత్త, గొప్ప వక్త, గొప్ప నాయకుడు, గొప్ప స్వాప్నికుడు అయిన అబ్ధుల్ కలాం.. తన తల్లిని ప్రేమించే గొప్ప ప్రేమికుడు. ఆయనకు తల్లి అంటే చాలా ఇష్టం. దేశభక్తుడు, భరత మాత సేవలోనూ తన వంతు తరించి అబ్దుల్ కలాం.. తన కన్న తల్లిపై అమితమైన అనురాగాన్ని పెంచుకున్నారు. ఉపన్యాసాల్లో తల్లి గురించి ఎక్కడైనా కోట్ చేసేవారు. ఈ క్రమంలో తన తల్లి తనకు మిగిలిన వారికంటే ఎక్కువగా తిండి పెట్టేదని చెప్పుకునేవారు. 
 
ఇంకా ఉపన్యాసాల్లో బాల్యం గురించి అబ్దుల్ కలాం గొప్పగా చెప్పుకునేవారు. ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడిననని చెప్పారు. అమ్మ ఉదయాన్నే నిద్రలేపేదని, స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడినని, స్నానం చేసి రాకపోతే.. మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదని కలాం చెప్పుకున్నారు.
 
 
నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాడ్ని. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పని చేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు.

'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ.. పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం.. విషాదం రెండూ ఉండేవి' అని ఉపన్యాసాల్లో కలాం తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకునేవారు...

Share this Story:

Follow Webdunia telugu