Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్రలో బస్సు దగ్ధం.. 25మంది ప్రయాణీకులు సజీవ దహనం

bus fire
, శనివారం, 1 జులై 2023 (08:51 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ బస్సులో మంటలు చెలరేగడంతో 25మంది ప్రయాణీకులు సజీవంగా దహనమ్యాయరు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
 
32 మంది ప్రయాణికులతో యావత్మాల్ నుంచి పూణె వెళ్తున్న బస్సు బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. 
 
ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nokia G42 5G.. భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే?