కష్టపడి చదివినా ఇంగ్లీష్ రాలేదనీ... 16 యేళ్ళ విద్యార్థిని ఆత్మహత్య
ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎంత కష్టపడి చదివినా ఇంగ్లిష్ రాకపోవడంతో మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీ
ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎంత కష్టపడి చదివినా ఇంగ్లిష్ రాకపోవడంతో మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
తిరువాణ్ణామలై పట్టణానికి చెందిన కష్టవలి, పుంగోడి దంపతుల కూతురైన భవాని స్థానిక మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఇంగ్లీష్పై తనకు పట్టులేకపోవడంతో భవాని చాలాసార్లు తీవ్ర నిరాశ చెందింది.
ఈ సబ్జెక్ట్ టెస్టుల్లోనూ తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె పలుసార్లు తనకు స్కూలుకు వెళ్లడం ఇష్టంలేదని తోబుట్టువులకు చెప్పిందని, ఈ నేపథ్యంలోనే భవాని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.