Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాహిబాబాద్‌ వస్త్ర మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. నిద్రిస్తూ 13మంది సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని సాహిబాబాద్‌ వస్త్ర మిల్లులో శుక్రవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 13 మంది అగ్నికి ఆహుతైనారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమవడంతో ప

Advertiesment
13 dead
, శుక్రవారం, 11 నవంబరు 2016 (19:08 IST)
ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని సాహిబాబాద్‌ వస్త్ర మిల్లులో శుక్రవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 13 మంది అగ్నికి ఆహుతైనారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమవడంతో పేద కార్మికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. 12 అగ్నిమాపక వాహనాలు అతి కష్టం మీద మంటలను అదుపుచేశాయి. కేవలం ఇద్దరు కార్మికులను సిబ్బంది రక్షించగలిగారు. ఈ వస్త్ర మిల్లును అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
గత నెల అక్టోబరులో సాహిబాబాద్‌లోని ఓ టపాసుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయాలపాలైనారు. ఈ ఘటన మరవక ముందే వస్త్ర మిల్లులో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. కార్మికులు నిద్రిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెప్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద నోట్ల రద్దు.. నోట్ల మార్పిడి కోసం రాహుల్ గాంధీ.. ప్రజలతో పాటు క్యూలో నిల్చున్నారు