తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మృతి చెందారు. సేలంలోని సందై తడం అనే ప్రాంతంలో ఇరు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళతో పాటు తొమ్మిది మంది మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు.
సేలం జిల్లా ఓమలూరుకు సమీపంలోని సందై తడం వద్ద సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును, బెంగళూరు నుంచి కొట్టయంకు వస్తున్న ఆమ్నీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
బస్సుకు అడ్డంగా ద్విచక్ర వాహనం రావడంతో ఢీకొనడాన్ని నియంత్రించే క్రమంలో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఓమలూరు, సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.