Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సేలం రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి!

Advertiesment
సేలం
తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మృతి చెందారు. సేలంలోని సందై తడం అనే ప్రాంతంలో ఇరు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళతో పాటు తొమ్మిది మంది మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు.

సేలం జిల్లా ఓమలూరుకు సమీపంలోని సందై తడం వద్ద సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును, బెంగళూరు నుంచి కొట్టయంకు వస్తున్న ఆమ్నీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

బస్సుకు అడ్డంగా ద్విచక్ర వాహనం రావడంతో ఢీకొనడాన్ని నియంత్రించే క్రమంలో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఓమలూరు, సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu