మహాత్మాకు జాతిపిత గౌరవం : వివరాలు లేవంటున్న ఆర్టీఐ!!
, బుధవారం, 4 ఏప్రియల్ 2012 (12:06 IST)
మహాత్మా గాంధీకి జాతిపిత గౌరవం ఎపుడు, ఆయన జాతిపిత ఎపుడు అయ్యారు అనే సందేహం ఓ పదేళ్ళ చిన్నారికి వచ్చింది. వచ్చిందే తడవుగా ఆర్టీఐ చట్టం కింద సమాచారం సేకరించాలని నిర్ణయించుకుని దరఖాస్తు చేసింది. ఆ చిన్నారికి వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసేందుకు తమ వద్ద స్పష్టమైన సమాచారం లేదని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గాంధీకి జాతిపిత గౌరవాన్ని ఎపుడు ఇచ్చారో తెలియజేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన ఐశ్వర్యా పరాశర్ అనే పదేళ్ళ బాలిక పిటీషన్ను దాఖలు చేసిన పిటీషన్పై ఆర్టీఐ కార్యాలయం పై విధంగా సమాధానం చెప్పింది. ఈ బాలిక.. స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. గాంధీకి జాతిపిత ఎపుడయ్యారు. ఎందుకు ఇచ్చారు. దీనికి సంబంధించి ఏదైన ఆధారాలు ఉంటే తనకు ఇవ్వాలంటూ ఆ చిన్నారు గత యేడాది ఫిబ్రవరిలో ఆర్టీఐ కమిషనర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. ఈ అంశంపై తమ వద్ద సమాచారం లేదని ఆ దరఖాస్తును వారు హోంశాఖ కార్యలయానికి బదిలీ చేశారు. దీనిని పరిశీలించిన హోంశాఖ అది తమ పరిధిలోకి రాదని జాతీయ ప్రాచీన పత్రాల భాండాగారం (నేషనల్ అర్చీవ్స్ ఆఫ్ ఇండియా)కు ఆ దరఖాస్తును బదిలీ చేశారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. తమ వద్ద ఉన్న పత్రాల భాండాగారంలో జాతిపిత ఎప్పుడయ్యారు అనే విషయానికి సంబంధించిన వివారాలు ఏవి లేవని నేషనల్, అర్చీవ్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జయప్రభ రవీంద్రదన్ సమాధానం ఇచ్చి చేతులు దులుపుకున్నారు.